
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్, తన దేశం విఫల దేశంగా మారుతోందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
అవామీ లీగ్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వందలాది మంది ఉగ్రవాదులు విడుదలయ్యారని, హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి సంస్థలు బహిరంగంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్లో తలెత్తిన తాజా పరిణామాలు భారత్కు దీర్ఘకాలిక ముప్పుగా పరిణమిస్తాయని, భవిష్యత్తులో దేశం ఉగ్రవాద కేంద్రంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.